సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకొన్న భక్తులు పోడగట్లపల్లి వాస్తవ్యులు భూపతి రాజు రామ కేశవ బంగారు రాజు శ్రీమతి సత్యవతి దంపతులు వారి కుమార్తె జ్ఞాన దీపిక పేరున శ్రీ అమ్మవారికి రెండు కాసుల బంగారము మరియు 1కేజీ 50 గ్రాములు వెండి కానుకలుగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ మానేపల్లి నాగేశ్వరరావు, ధర్మకర్తలు ముత్యాల వెంకట రామారావు , రామాయణం సత్యనారాయణ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు
