సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో నేటి బుధవారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న భీమవరం మండలం గోల్లవానితిప్ప గ్రామానికి చెందిన భక్తులు రాయుడు శ్రీరామమూర్తి మరియు ఆయన కుటుంబసమేతంగా వచ్చి .. శ్రీ అమ్మవారి ఆలయంలో భక్తులకు జరిగే నిత్యా అన్నసమారాధన కు 1 లక్ష రూపాయలు కానుకగా అందజేశారు. వీరిచే ఆలయ ముఖ్య అర్చుకులు మద్దిరాలరమణశర్మ అమ్మవారికి పూజలు నిర్వహించినారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ అమ్మవారి ఫోటో ప్రసాదాలు అందజేశారు, నేటి, బుధవారం రాత్రి రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి విడుదల రజని శ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకొంటారని తాజగా సమాచారం..
