సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చిత్తూరు, తిరుపతి జిల్లాల వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమ ణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరు అయిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు అయ్యి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చిన తరువాత ఈ 5 నెలలలో మహిళలలో జరిగినన్ని అరాచకాలు గతంలో ఎప్పుడు జరగలేదని అన్నారు. అంతా దోచుకోవడమే తప్ప.. అబివృద్ధి జాడ లేదని, అన్ని ధరలు పెరిగిపోయాయని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. జమిలి ఎన్నికలు నేపథ్యంలో.. వైసీపీ శ్రేణులు ఉత్సహంతో పనిచేయాలని 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీఎవరూ ఊహించని విధంగా విజయం సాధిస్తుం దని జగన్ మరల సీఎం కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. సనాతన ధర్మం అంటే మూఢ నమ్మకం కాదు, అది ఎంతో విశాలమైన భావజాలం సేవ తత్పరత నిండిన మహోన్నత హిందూ ధర్మం.. వైజాగ్ ఋషి కొండ ఫై జగన్ మన రాష్ట్ర ప్రభుత్వం స్థాయి ని పెంచే విధంగా కట్టించిన ప్రభుత్వ భవనాలు చూసి చంద్రబాబు ఇటువంటి భవనాలు తాను ఎక్కడ చూడలేదని నిజంగా ఆనందించాడు అన్నారు. మరి చంద్రబాబు కట్టించిన సచివాలయం.. అసెంబ్లీ భవనాలు చుస్తే .. చాలు ఆయన పాలన అర్ధం అవుతుందన్నారు.
