సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశంలో ప్రముఖ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీ ఝలక్ ఇచ్చింది. వాహనాల వెహికిల్స్‌ విభాగానికి సంబంధించిన ముత్తూట్‌ వెహికిల్‌ అండ్‌ అస్సెట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌కు ఆథరైజేషన్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నియంత్రణ అవసరాలకు అనుగుణంగా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అంతేకాదు చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్‌ (PSO)గా ఉన్న మరో కంపెనీ ఈకో(EKO) ఇండియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు సైతం సీవోఏను రద్దు చేసేసింది. ఇదిలా ఉంటే ఎస్బీఐ, ఐసీసీఐ బ్యాంక్‌తో పాటు యస్‌ బ్యాంక్‌ తరపున సేవలు అందిస్తోంది ఈకో. సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ (CoA) రద్దు చేయబడిన తరువాత.. ముత్తూట్‌ వెహికిల్‌ ఫైనాన్స్‌, ఈకో కంపెనీలు ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల జారీ, నిర్వహణ లాంటి వ్యాపారాలకు అర్హత కోల్పోయినట్లు అయ్యింది. అయితే, క్లెయిమ్ ఉన్న కస్టమర్‌లు, వ్యాపారులు.. రద్దు చేసిన తేదీ నుండి మూడు సంవత్సరాలలోపు తమ క్లెయిమ్‌ల పరిష్కారం కోసం వారిని సంప్రదించుకోవచ్చును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *