సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:రాష్ట్ర ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, మంగళవారం చింతలకోటిగరువు గ్రామంలో ప్రజలు సమక్షంలో రూ 54 లక్షల తో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. గ్రామా పెద్దలు స్థానిక వైసీపీ నెట్లను ఆయనకు ఘన స్వగతం పలికారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో సైతం ప్రజలకు పూర్తిస్థాయిలో అన్నిరకాల ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా సచివాలయ వ్యవస్థ రూపొందింది. ప్రజలు సదివినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. తదుపరి భీమవరం పట్టణం 7వ వార్డులోని మారుతినగర్ లో 12 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేసిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు.
