సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విజయదశమి (దసరా పండుగ) సెలవును మారుస్తూ ప్రభుత్వం తాజగా నిర్ణయం తీసుకుంది. ఈనెల 24న విజయదశమి సందర్భంగా సాధారణ సెలవుగా ప్రకటన చేసారు. ఈ మేరకు నేడు, బుధవారం ఉదయం సీఎస్ జవహర్ రెడ్డి జీవోఆర్టీ నంబర్ 2047ను విడుదల చేశారు. గతంలో దసరాను ఐచ్ఛిక సెలవుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తిరిగి స్వల్ప మార్పులతో సీఎస్ జవహర్ రెడ్డి ఈరోజు మరో ఉత్తర్వులను విడుదల చేశారు.ప్రభుత్వ ఉద్యొగులు ఇది గమనించగలరు.
