సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం పురపాలక సంఘ పరిధిలో బివి రాజు కాలేజీకి వెళ్లే రోడ్డులో దుర్గాపురం కొత్తగా నిర్మించిన అమృత.. రిజర్వాయర్ యొక్క పంపింగ్ మెయిను ఇంటర్కనెక్షన్ పనులు అత్యవసరంగా జరుగుచున్నందున రెండవ పట్టణ ప్రాంతం మొత్తము మరియు ఒకటవ పట్టణ ప్రాంత పరిధిలో 7వ వార్డు, 10 నుండి 18వ వార్డులు, 23 నుండి 28వ వార్డులకు రేపు మంగళవారం అనగా 28-11-2023 సాయంత్రం మంచినీటి సరఫరా జరగదు. కావున ప్రజలందరూ మంచినీటిని పొదుపుగా వాడుకుని పురపాలక సంఘానికి సహకరించవలసినదిగా కమిషనర్ ఎం శ్యామల ఓక ప్రకటనలో కోరారు.
