సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో శ్రీ విష్ణు ఇంజినీరింగ్ మహిళా కళాశాల యొక్క కమ్యూనిటీ రేడియో స్టేషన్ అయిన “రేడియో విష్ణు 90.4” సుదీర్ఘ నిరంతర రేడియో నాటకం ప్రసారం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిందని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు ప్రకటించారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, భీమవరం క్యాంపస్లోని వివిధ సంస్థలకు చెందిన 100 మంది విద్యార్థుల రేడియో జాకీల భాగస్వామ్యంతో ఈ ప్రసారం 72 గంటల 30 నిమిషాల 30 సెకన్ల పాటు ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు, శుక్రవారం , శ్రీ విష్ణు.. చైర్మన్ కె.వి.విష్ణు రాజు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ను ఆవిష్కరించి, అద్భుతమైన విజయాన్ని సాధించిన కళాశాల సిబ్బందిని మరియు విద్యార్థులను అభినందించారు. 2007లో స్థాపించబడిన రేడియో విష్ణు 90.4, ఆంధ్ర ప్రదేశ్లోని మొదటి విద్య-కేంద్రీకృత, చర్చ-ఆధారిత రేడియో స్టేషన్ అని తెలియజేశారు. భీమవరం పట్టణ పరిధిలో 15 కిమీ పరిధిలో విభిన్న ప్రసార కార్యక్రమాలలో పాల్గొనేందుకు విద్యార్థులకు వేదికను అందించడానికి, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, డిబేటింగ్ ఎబిలిటీస్, సమస్య-పరిష్కార సామర్థ్యం ఫై ప్రసారాలు అందించింది అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (అడ్మిన్.) జె. ప్రసాద రాజు, డైరెక్టర్- స్టూడెంట్ అఫైర్స్ & అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ పి. శ్రీనివాసరాజు, బి.వి.రాజు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.ఆర్.కె. రాజు, రేడియో 90.4 ప్రోగ్రాం హెడ్ ప్రసాద్ కలిగొట్ల, వి.వి. సుబ్రహ్మణ్యం, కళాశాల సిబ్బంది, పాల్గొన్నారు.
