సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు భీమవరం పట్టణంలో “స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం నిర్వహించ తలపెట్టిన “స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమమును “సోర్స్- రిసోర్స్ * అనే ఇతివృత్తంగా నేటి శనివారం ఉదయం స్థానిక 20వ వార్డు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా గల S.J.G.M హై స్కూల్ మైదానంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భీమవరం పురపాలక సంఘ కమిషనర్, అధికారులు మరియు స్వచ్ఛంద్ర సేవా సంస్థల వారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇంటి వద్దనే వ్యర్ధాలను వేరు చేయుట గురించి, ఇంటి వద్దనే తడి చెత్తను హోం కంపోస్ట్ గా మార్చుకునే విధానం మరియు నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో ఉపయోగించవలసిన ప్రత్యామ్నాయ పర్యావరణహిత వస్తువుల గురించి అధికారులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *