సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల విశాఖలో మంత్రులపై దాడి చేసిన కేసులలో అరెస్టు అయినా విశాఖ జనసేన కార్యకర్తలకు హైకోర్టులో నిరాశ ఎదురయింది.. విశాఖ జనసేన కార్య కర్తలపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ఫై నేడు, మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే విశాఖపట్నం లో జనసేన కార్య కర్తలపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అసలు నిందితుడు కాని మూడోవ్య క్తి పోలిసుల ఎఫ్ఐఆర్ ను ఎలా సవాలు చేస్తారని? హైకోర్టు ప్రశ్నించింది. అయితే దీనిపై కౌం టర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసిం ది.
