సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో బుధవారం నిర్వహించిన నూతన స్టీల్ సెక్టార్‌లో పరిశోధన మరియు అభివృద్ధి (R&D), స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఆర్టీఎంఐ) వెబ్-పోర్టల్‌లో స్టీల్ కొల్లాబ్ (SteelCollab) ప్లాట్‌ ఫారమ్‌ ను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. ముడి ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండవ అతిపెద్ద దేశంగా అవతరించడం ఆనందంగా ఉందని, స్టీల్ పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చించడం ఆనందంగా ఉందని అన్నారు. నూతన స్టీల్ సెక్టార్‌లో పరిశోధన మరియు అభివృద్ధి (R&D), స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఆర్టీఎంఐ) వెబ్-పోర్టల్‌లో స్టీల్ కొల్లాబ్ ప్లాట్‌ ఫారమ్‌ను విజయవంతంగా ప్రారంభించడం ద్వారా ఉక్కు తయారీలో నూతన ఆవిష్కరణలు, స్థిరత్వం, సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడానికి ప్రధాన మోదీ నాయకత్వంలో బలమైన పునాదిని వేశామని పేర్కొన్నారు. ఎస్ఆర్టీఎంఐ వెబ్ సైట్ ద్వారా ఆసక్తిగల వాటాదారులను, ఈ రంగం అభివృద్ధికి సహకరించడానికి ఆహ్వానిస్తున్నట్టు, నూతనంగా ప్రారంభించిన మూడు ఆర్ అండ్ డి పథకాలు స్టీల్ రంగ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయన్నారు. పరిశ్రమ నాయకులు, విద్యా నిపుణులు, టెక్నాలజీ ప్రొవైడర్లు, స్టార్టప్‌లు వంటి వాటాదారులంతా ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని స్టీల్ పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్ పారిశ్రామిక , విద్యారంగం ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *