సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర తపాలా శాఖకు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌ (IPPB).. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 348 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ( వీటిలో తెలంగాణ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 09, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 8 ఉన్నాయి)అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు వారి వెబ్ సైట్ లో చెక్‌ చేసుకోండి..ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్ 29, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్షా తరువాత ఎంపికైన వారికి నెలకు రూ.30,000 జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు చెల్లిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *