సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఎన్డీఏకూటమి పార్లమెంట్ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఈరోజు గురువారం ఎన్డీఏ కూటమి మద్దతు ఇస్తున్న జనసేన అసెంబ్లీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు స్థానిక ఎడ్వార్డ్ ట్యాంక్ వద్ద ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రధాన శిబిరం ప్రారంభోత్సవంలో పూజ కార్యక్రమాలలో పాల్గొని అంజిబాబు కు శుభాభినందనలు తెలిపారు. శిబిరంలో కోలాహలంగా ఉన్న జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులతో కొద్దీ సేపు ముచ్చటించడం జరిగింది. వచ్చే ఎన్నికలలో అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ లలో అభ్యర్థులు సమన్వయంతో వ్యవహరించి కూటమి విజయం సాధించడం లో కృషి చెయ్యాలని కూటమి క్యాడర్ కు పిలుపునిచ్చారు భూపతిరాజు శ్రీనివాసవర్మ.
