సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలోని తన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన పలువురు దివ్యాంగులకు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు నేడు శనివారం ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు.ఈ ట్రైసైకిళ్లు వారి దైనందిన ప్రయాణానికి తోడ్పడటంతో పాటు, ఆత్మవిశ్వాసంతో స్వావలంబన దిశగా ముందుకు సాగేందుకు దోహదపడాలని ఆకాంక్షిస్తున్నట్లు రఘురామ తెలిపారు.
