సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు రేపు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు ప్రకటించారు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా టెన్త్ ఫలితాలతో పాటే విడుదల చేస్తామన్నారు. అలాగే మనమిత్ర వాట్సాప్, లీప్ మొబైల్ యాప్లలో అందుబాటులో ఉంటాయన్నారు. 9552300009 నంబరుకు హాయ్ అని మెసేజ్ చేసి, విద్యా సేవల ఆప్షన్ ద్వారా ఫలితాలను పీడీఎఫ్ కాపీ రూపంలో చాల సులభంగా అందుకోవచ్చు.
