సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దారుణమైన స్టాక్ మార్కెట్ పతనం ఇప్పటిలో వదిలేలా లేదు.. నేడు, సోమవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) భారీ నష్టాలతో మొదలయ్యాయి. మొదట ప్రారంభ ట్రేడింగ్లో అన్ని సూచీలు గ్రీన్లో ప్రారంభమయ్యాయి. కానీ ఆ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ రెడ్లోకి మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9.53 నిమిషాల నాటికి సెన్సెక్స్ 421 పాయింట్ల నష్టంతో 77,159 స్థాయిలో ఉంది. , నిఫ్టీ 137 పాయింట్లు తగ్గి 23,396 పరిధిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 50,249 స్థాయిలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 152 పాయింట్లు నష్టపోయింది. దీంతో మదుపర్లు లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.
