సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు చిలుకూరు గ్రామ వాస్తవ్యలు పెన్మత్య సత్యనారాయణ రాజు జయలక్ష్మి దంపతులు , కీ.శే. శ్రీమతి చేకూరి రమావతి పేరుమీద 32 గ్రాముల బంగారం (4 కాసులు)కానుకగా అందజేశారు. వీరికి ఆలయ అర్చుకులు కొప్పేశ్వరావు పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణిధికారి యర్రంశెట్టి భద్రాజీ మరియు ఆలయ ధర్మకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.రేపు మంగళవారం ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు జరగనుంది.
