సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుతుగున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం నిన్న శనివారం దేశవ్యాప్తంగా 12,193 కొత్త కేసులునమోదు కాగా, 42 మంది కోవిడ్ బారిన పడి మృతిచెందారు. ఇక మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు ముఖ్యంగా ఏలూరులో పెరుగుతుండటం ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. గత శనివారం ఒక్క రోజులో ఏలూరు జిల్లాలో 39, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 135కి చేరింది. ప్రజలు ప్రెవేటు ల్యాబ్ లలో చేయించుకున్న టెస్టుల ఫలితాలు అనధికారంగానే ఉన్నాయి. వాటిని కలిపితే కేసుల సంఖ్య భారీగా ఉండే అవకాశంఉంది.
