సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో పలు వార్డులలో శ్రీ మావుళ్ళమ్మవారి ఆషాఢమాస జాతర మహోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో నేడు, ఆదివారం ఉదయం స్థానిక 20 వ,వార్డులోఘనంగా నిర్వహించిన శ్రీ మావుళ్ళమ్మ జాతర కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ గారి తనయుడు గ్రంధి రవితేజ పాల్గొని శ్రీ అమ్మవారికి ప్రత్యక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమములో స్థానిక యూత్ మరియు మాజీ కౌన్సిలర్ మెంటే బలరాం, ఇళ్లా బ్రదర్స్ పాల్గొన్నారు.
