సిగ్మాతెలుగు డాట్, న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు, బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత సుభాని అకాల మరణానికి సంతాపం తెలుపుతూ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ .. తమ ప్రభుత్వం వచ్చాక ముస్లీములు కోసం అర్హత ఉన్న ప్రతి మసీదుకు రిజిస్ట్రేషన్ చేయించాలని, కరెంట్ బిల్లులో సబ్సిడీ ఇవ్వాలనే విషయాన్ని తప్పకుండా పరిశీలనలోకి తీసుకొని హామీ నెరవేరుస్తానన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మైనారిటీలను మోసం చేసిందని విమర్శించారు.మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన ఘనత తమదేనని చంద్రబాబు అన్నారు. దుల్హన్ పథకం అమలు చేశామని, దీనిపై వైసీపీ నిబంధనలు పెట్టి.. దుల్హన్ పధకాన్ని నాశనం చేసిందన్నారు. రంజాన్ తోఫా ఇచ్చి పేద ముస్లింల ఇంట టీడీపీ వెలుగులు నింపామన్నారు. ఇప్పుడు ముస్లింలకు ఇవ్వాల్సిన పథకాలకు వైసీపీ తిలోదకాలు ఇచ్చిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం అలవాటయింది అన్నారు, ఈ ప్రభుత్వం మైనారిటీ సోదరులపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. చూస్తూ ఊరుకోమని చంద్రబాబు హెచ్చరించారు జగన్ అధికారంలోకి రాగానే సాక్షి పేపర్కు రూ. 1000 కోట్ల యాడ్స్ ఇచ్చారని ఆరోపించారు. జగన్ పోలీసులతో కేసులు పెట్టి పరిపాలన చేయాలని చూస్తున్నారని.. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఏపీలో టీడీపీ కార్యకర్తలు ప్రజలు బ్రతుకుతున్నారన్నారు.
