సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 3వ పట్టణంలోని 5,10వ వార్డు లలో ఉన్న ఓవర్ బ్రిడ్జి కింద అరుణ ఫైనాన్స్ నుండి బీసీ హాస్టల్స్ వరకు రూ 20 లక్షలతో నిర్మించిన సిసి రోడ్ ను ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఓవర్ బ్రీజ్ క్రిందగా చాల ఏళ్లుగా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న ఈ రొడ్డు పనులు నా హయాంలో పూర్తీ అయ్యి ప్రారంభించడం చాల ఆనందంగా ఉందని ఇకపై వాహనదారులు కు ఈ రోడ్డు మరింత సౌకర్యంగా ఉంటుందని, సీఎం జగన్ సహకారంతో భీమవరం పట్టణంలోని అన్ని వార్డులలో ప్రజలకు అబివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్యామల, వేండ్ర వెంకట స్వామి, కామన నాగేశ్వర రావు తదితర వైసిపి నేతలు అధికారులు పాల్గొన్నారు
