సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఒకనాటి సమైక్య ఆంధ్ర ప్రదేశ్ కోసం పోరాడి అకస్మాత్ గా ఉద్యమాన్ని విరమించి విమర్శలు ఎదుర్కొన్న సమైక్య రాష్ట్ర ఉద్యోగ సంఘ నేత, తన ఉద్యోగ విరమణ తరువాత టీడీపీ లో చేరి ఎమ్మెల్సీ అయిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. గతంలో ఏసీటీవోగా పని చేసిన సమయంలో అశోక్బాబు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. తన సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చి ప్రమోషన్ సాధించారని కేసు నమోదైంది. బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే అభియోగంపై కేసు నమోదు చేశారు. రికార్డులను ట్యాంపరింగ్ చేయడమే కాకుండా, ఎమ్మెల్సీ ఎన్నికల అఫిడవిట్లోసైతం డిగ్రీ చదివినట్లు పేర్కొన్నారనే అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. అశోక్ బాబు పైన సెక్షన్ 477A, 465,420 కింద కేసు నమోదు చేశారు. 2021లో అశోక్బాబుపై లోకాయుక్తాలో కేసు నమోదు కాగా, ఆ కేసును సీఐడీకి అప్పగించాలని లోకాయుక్తా ఆదేశాలు జారీ చేసిన సంగతి ఇక్కడ గమనార్హం..
