సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేరళ లోని శబరిమలలో లక్షలాది అయ్యప్ప భక్తులకు.. నేటి మకర సంక్రాంతి సోమవారం సాయంత్రం 6.47 గంటలకు కేరళలోని శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నాంబళమేడుపై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. మొత్తం మూడుసార్లు జ్యోతి దర్శ నమిచ్చింది. జ్యోతి దర్శనమిచ్చిన సందర్భంగా శబరిగిరులు అయ్య ప్ప నామస్మ రణతో మారుమోగాయి.సుమారు 4 లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతిని వీక్షించారు. పరోక్షంగా టీవీలు, యూట్యూబ్ లలో కొన్ని కోట్ల మంది జ్యోతి దర్శనం చేసుకున్నారు.
