సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, శనివారం ప్రముఖ సినీ నటులు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి సతీమణి సురేఖ మరియు కుమార్తెలు దర్శించుకున్నారు వీరికి ఆలయ మర్యాదలతో శ్రీ అమ్మవారి సన్నిధానంలో అర్చకులు పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ముత్యాల రామారావు ఆలయ సూపర్డెంట్ పి వాసు వారికీ ప్రసాదం శేషవస్త్రం అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధా మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
