సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రామానాయుడు ఇంటింటికి ఎన్నికల ప్రచార యాత్ర లో దూసుకొనిపోతున్నారు. నేడు, మంగళవారం 22,23వార్డు లో ఇంటిటా ప్రచారం లో ప్రజలను వారి పేరుపెట్టి పలకరిస్తూ తనదయిన వినూత్న శైలి లో ప్రచారం చేసారు. కొందరు టీడీపీ అభిమానులు ఆయనపై పుష్పాలు చల్లుతూ శాలువా కప్పి ఉత్సహపరిచారు.తనను ముచ్చటగా 3వ సారి సైకిల్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని ఓటర్లు ను కోరుతున్నారు. ఆయనతో పాటు ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ , . పెచ్చెట్టి బాబు, GV, కర్నెని గౌరినాయుడు,వట్టం గణేష్ మరియు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు.
