సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఆదివారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కూటమి అభ్యర్థుల విజయాల కోసం స్థానిక ప్రకాశం చౌక్ లో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభలో జనసేన టీడీపీ బీజేపీ కి చెందిన నేతలు పాల్గొంటారని ఈ బహిరంగ సభను భీమవరం లో కూటమి పార్టీల నేతలు క్యాడర్ విజయవంతం చెయ్యాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అడ్జక్షులు కొటికలపూడి గోవిందరావు పిలుపు నిచ్చారు. నేడు, పవన్ కళ్యాణ్ రాజా నగరంలో వారాహి ఫై ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం.
