సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొత్తగా చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడుతున్న కొత్త ప్రభుత్వంలో రాష్ట్ర సీఎంతో కలిపి 26మందికి మించి మంత్రివర్గం ఉండే అవకాశం లేదు. ఈనేపథ్యంలో కూటమిలోని టీడీపీ నుంచి 19- 20 మందికి, జనసేన నుంచి నలుగురికి, బీజేపీ నుంచి ఇద్దరికీ ( సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ )మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చని చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రివర్గంలో టీడీపీ నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కింది. దీంతో బీజేపీకి రాష్ట్రంలో ఒక మంత్రి పదవి రావొచ్చు. ఇండియా టుడే ఇంటర్యూ లో జనసేన అధినేత పవన్కళ్యాణ్కు తనకు ఉప ముఖ్యమంత్రి చెప్పట్టడానికి అభ్యన్తరం ఏమి లేదని ప్రకటించడం తో చంద్రబాబు ఆయనకు ఆ పదవి ఖాయం చేసినట్లు తెలుస్తుంది. అయితే లోకేష్ దానికి అభ్యన్తరం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే కూటమి జట్టు కోసం ఎన్నో త్యాగాలు చేసి ఇచ్చిన 21 సీట్లో లో గెలచి సత్తా చాటిన పవన్ పవర్ ను చంద్రబాబు గౌరవిస్తారని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు మరో ముగ్గురుకి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కమ్మ వర్గం నుండి నాదెండ్ల మనోహర్ ఖాయంగా మంత్రి కానున్నారు. గెలిచిన 21 మందిలో దాదాపు 10 మంది కాపు సామాజిక వర్గం నేతలు ఉండటంతో ఆ సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు రావొచ్చు బీసీ సామాజిక వర్గం నుంచి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు మంత్రిగా కచ్చితంగా అవకాశం ఉండే అవకాశం ఉంది. కాపు సామాజిక వర్గం నుంచి కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, కందుల దుర్గేష్ పోటీపడుతున్నారు. రేపు మంగళవారం రాత్రికల్లా లిస్ట్ వచ్చేస్తుంది మరి..
