సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక సుంకరపద్దయ్య గారి వీధిలో నెలకొని ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద స్వామివారి జయంతి ఉత్సవాల్లో భాగంగా దేవాలయం నందు స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం అఖండ అన్నసమారాధన కార్యక్రమాన్ని జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్జక్షులు కొటికలపూడిగోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భముగా చినబాబు మాట్లాడుతూ.. శ్రీ ఆంజనేయ స్వామివారి అస్సిసులతో ఈ కార్యక్రమం లో పాల్గొనడం ఆనందంగా ఉందని, అందరికి మంచి జరుగుతుందని ,ఆ పవన సుతుని దయతోనే ప్రజల మనస్సులు గెలచి మన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కు బాటలు వేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో చెనమల్ల చంద్రశేఖర్ ఇతర జనసేన నేతలు పాల్గొన్నారు
