సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక మెంటేవారి వీధిలోని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ వైస్ చైర్మెన్ , మాజీ కౌన్సిలర్ మెంటే గోపి తల్లి మంగతాయారు గత ఆదివారం మరణించడం జరిగింది. ఈనేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వారి స్వగృహానికి వెళ్లి గోపి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి తల్లిగారి ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలిపారు. ఆయనతో పాటు టీడీపీ నేత కోళ్ల నాగేశ్వర్రావు, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా మన సిగ్మా న్యూస్ కూడా మా కుటుంబ సన్నిహితులు మెంటే గోపి కుటుంబ సబ్యులకు తీవ్ర సంతాపం తెలియజేస్తుంది.
