సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రులకు వివిధ జిల్లాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నేడు. మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళికాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ జీవోఎంఎస్ నెంబర్ 3ను జారీ చేశారు. తెలుగులోనే ఏపీ ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా ఏలూరు జిల్లాకు నాదెండ్ల మనోహర్ ను పశ్చిమగోదావరి జిల్లాకు గొట్టిపాటి రవికుమార్ ని ఇంచార్జి మంత్రులుగా నియమించారు. ఇక ఫై జిల్లాలో ఎమెల్యేలు మంత్రులు పాలనా వ్యవహారాలు ముందుగా వీరి దృష్టికి తీసుకొనిరావలసి ఉంటుంది.
