సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:నేడు, బుధవారం ఏపీ క్యాబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగింది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట, అక్రమ మద్యం అమ్మకాలు అరికట్టడం ,రీహాబిలిటేషన్ పై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.ఇక, రాష్ట్రంలో పునరుద్పాదక విద్యుత్, పంప్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వనరుల వినియోగం పెంచేలా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0ని క్యాబినెట్ ఆమోదించింది. దీంతో పాటు 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీ, పారిశ్రామిక ప్రోత్సా హకాలను ఎస్క్రో ఖాతాలో వేసే విధం గా పారిశ్రామిక పాలసీ ఉండాలని కాబినెట్ నిర్ణయించింది. ఇక, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ పైనా రాష్ట్ర మంత్రివర్గంలో చర్చ జరిగింది.. 2030 నాటికి ఇంటింటికీ ఓ పారిశ్రామిక వేత్త అనే అంశంతో నూతన ఎంఎస్ఎం ఈ పాలసీకి చం ద్రబాబు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్ని ప్రోత్సహించేలా కొత్త పాలసీపై చర్చించి ఆమోదం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *