సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీలో టూరిజం ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది ఏపీ కేబినెట్. కబ్జాలకు కళ్లెం వేస్తూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024కు ఆమోదం తెలిపింది. సీఎన్జీపై వ్యాట్ 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.… విశాఖ, విజయవాడ మెట్రో డీపీఆర్లకు ఆమోదం సహా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి.ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నేరాలను నియంత్రించేలా పీడీయాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. అలాగే లోకాయుక్త చట్ట సవరణ బిల్లు సహా దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకగంజాయి, డ్రగ్స్ మత్తు దందా ను నిరోధించడానికి రాష్ట్రంలో యాంటీ నార్కొటిక్స్ టాస్క్ఫోర్స్ను పేరు ఈగల్ గా మారుస్తూ ఎలైట్ యాంటీ యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్.ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు కుదించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రధాన మత్రి ఆవాస్ యోజన కోసం గృహ నిర్మాణ వాఖ చేసుకున్న ఒప్పందానికి ఆమోదం తెలిపింది కేబినెట్.
