సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ మరియు గోదావరి జిల్లాల మధ్య ప్రయాణికులకు శుభవార్త! ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా చర్లపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-నర్సాపూర్ మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పిఆర్ వో నుస్రత్ మండ్రుష్కర్ ప్రకటించారు. చర్లపల్లి-కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07031) ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో రాత్రి 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07032) మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరుతుంది.రెండు మార్గాల్లో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లో ఆగుతుంది. అలాగే, చర్లపల్లి- నర్సాపూర్ ప్రత్యేక రైలు (07233) ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో రాత్రి 8.15 గంటలకు చర్లపల్లిలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07234) మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో రాత్రి 8గంటలకు నర్సాపూర్లో బయలుదేరుతుంది. రెండు మార్గాల్లో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్లో ఆగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *