సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా పలువురు ముస్లీమ్ ప్రముఖులు, కాంగ్రెస్, మజ్లీస్ తదితర రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ”వక్ఫ్ సవరణ బిల్లు-2025”ని పార్లమెంట్‌లో నేడు ప్రవేశపెట్టి దేశ చరిత్రలో మరో సాహసోపేతమైన అడుగు వేస్తుంది. నేటి బుధవారం ఈ మధ్యాహ్నం నుండి బిల్లుపై 8 గంటలు పాటు చర్చించనున్నారు. రేపు గురువారం రాజ్యసభలో బిల్లుపై చర్చ కొనసాగుతుంది. తొలిసారిగా 1954లో ”వక్ఫ్ చట్టాన్ని” పార్లమెంట్ ఆమోదించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేసి, వక్ఫ్ బోర్డుకు మరిన్ని అధికారాలు ఇస్తూ 1995లో కొత్త వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఏ ఆస్తినైనా ”వక్ఫ్ ఆస్తులు”గా ప్రకటించే అపరిమిత అధికారాలను వక్ఫ్ బోర్డులకు కట్టబెడుతూ 2013లో మరోసారి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. ప్రస్తుతం తీసుకువస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు 2025ని ఉమీద్ బిల్లు”గా పిలుస్తారు. ప్రస్తుతం దేశం మొత్తం 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 9.4 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఈ బిల్లును గతేడాది వర్షాలకు సమావేశాలకు ముందు ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చారు, అయితే విపక్షాలు అభ్యంతరం తెలపడంతో దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపించింది. జేపీసీ 14 సవరణలను ఆమోదించింది. ఇప్పుడు కొత్త చట్టం ద్వారా యాజమాన్య హక్కులను స్థానిక రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి నిర్ణయిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *