సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దిభీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనం లో నేడు, ది 08-04-2025 తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు చాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ వార్షిక సమావేశం జరిగినది. ఈ సమావేశంలో 2025-2027 సంవత్సరములకు నూతన కార్యవర్గమును బొండాడ రామ్మోహనరావు(రాంపండు) తాత్కాలిక అధ్యక్షతన ఎన్నుకోవడమైనది. నూతన అధ్యక్షులుగా పులఖండం కోటేశ్వరరావు ,ఉపాధ్యక్షులుగా తుమ్మలపల్లి నాగ శివ వెంకట కృష్ణమూర్తి శివ , రెండవ ఉపాధ్యక్షులుగా వబిలిశెట్టి వెంకటేశ్వరరావు ,మూడవ ఉపాధ్యక్షులుగా నార్కెడమిల్లి గురు ప్రసాద్ , కార్యదర్శులుగా కాగిత వెంకటరమణారావు, రెండవ కార్యదర్శిగా సంగడి వీర వెంకట శివ సత్యనారాయణ (బుజ్జి),మూడవ కార్యదర్శిగా ఆర్ వి ప్రసాద్ రావు ,నాలుగో కార్యదర్శిగా సుంకర సాయి వెంకట నాగ కేశవరావు (చినబాబు) కోశాధికారిగా కురిసేటి వెంకట సాయిరాం కుమార్ బాబు మరియు 18 మంది కార్యవర్గ సభ్యులుగాను ఎన్నుకోవడం వారికీ శుభాభినందనలు తెలపడం జరిగింది.
