సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంపురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, గురువారం దర్శించుకున్న స్థానిక భక్తులు కలిదిండి వెంకట సీతారామరాజు నిత్య శ్రీ కార్తీ దంపతులు శ్రీ అమ్మవారి స్వర్ణ వస్త్రం కోసం 16 గ్రాముల బంగారం కానుకగా సమర్పించారు. వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు ప్రత్యేక పూజ ఆశీర్వచనాలు నిర్వహించి ప్రసాదాలు శేషవస్త్రం ఫోటో అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
