సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురంలోని వీఆర్టీ గ్రానైట్ క్వారీలో నేడు, శనివారం.ఉదయం భారీ పేలుడు సంభవించడంతో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన కార్మికులు తెర్లంగి రామారావు, బడబంద అప్పన్న, తమిళనాడుకు చెందిన వంగ వేణు ఆర్ముగంగా గుర్తించారు. క్వారీలో భారీ పేలుడు సంభవించిందని, ఆపై పిడుగుపడినట్లు వీఆర్టీ గ్రానైట్ క్వారీ యాజమాన్యం తెలిపింది. అయితే ఈ ప్రమాదంపై కార్మికుల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కార్మికుల మృతదేహాలు ముక్కలయ్యాయి. .పోలీసుల దర్యాప్తు పూర్తి అయిన తర్వాత కార్మికుల మృతిపై అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
