సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరోసారి దేశంలో కరోనా 3. 0 సీక్వల్ గా మహమ్మారి విజృంభిస్తోంది. వందలాది కేసులు నమోదు అవుతున్నాయి. అయితే వైరస్ గతంలో అంత ప్రమాదకరంగా లేనప్పటికీ ఈ ఏడాదిలో కర్ణాటకలో తొలి కోవిడ్-19 మరణం నిన్న శనివారం నమోదైంది. 85 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా మృతి చెందాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో వైట్ ఫీల్డ్లోని ఆసుపత్రిలో చేరి మృతి చెందాడు. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 108 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఐదుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. కర్ణాటకలో ప్రస్తుతం మొత్తం 38 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగ మరో కేసు లో .. థానేలో డయాబెటిక్ కీటోయాసిడోసిస్తో బాధపడుతున్న 21 ఏళ్ల వ్యక్తి కూడా మృతి చెందాడు. ఇతనికి పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అయితే ఇతను కోవిడ్-19 కాదని.. కీటోయాసిడోసిస్తో ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు మాస్క్ లు ధరించి జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
