సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొద్దీ రోజుల క్రితం చందనోత్సవం నేపథ్యంలో వర్షాలకు కొత్తగా నిర్మించిన గోడకూలి 7 గురు భక్తులు మరణించిన ఘటన ప్రజలు మరువకుండానే విశాఖపట్నం జిల్లాలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో తాజగా నేడు, శనివారం అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో తొలిపావాంచా వద్ద భారీ రేకుల షెడ్డు ఆకస్మికంగా కూలింది. అదే సమయంలో షెడ్డుకింద ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయకపోవడంతో వల్లే షెడ్డు కూలిందని స్థానికులు అంటున్నారు. షెడ్డు కూలడంతో భక్తుల ఆందోళన చెందుతునన్నారు.
