సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయంలో శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చే దూరప్రాంత భక్తులకు ప్రతిరోజు అన్న ప్రసాద నిర్వహణ కోసం శాశ్వత నిత్య అన్నదానం ట్రస్టునకు నేడు, శుక్రవారం భీమవరం వాస్తవ్యులు ములగల వెంకట గోపాల సత్యనారాయణ శర్మ గారు ఒక లక్ష 116 రూపాయలు చెక్కును ఆలయ కార్య నిర్వహణాధికారి, దెందుకూరి రామకృష్ణంరాజు నకు అందజేశారు. వీరికి శ్రీ స్వామివారి శేష వస్త్రములను ప్రసాదములను ఇఓ అందజెయ్యడం జరిగింది.
