సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఆఫ్గనిస్తాన్ లోని కాబూల్ ఫై పాక్ విమానాలు ఆకస్మిక దాడి చేసి బాంబులు కురిపించినందుకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వం తమ దళాలు ఉమ్మడి సరిహద్దులో రాత్రిపూట జరిపిన ఆపరేషన్లలో 58 మంది పాకిస్తానీ సైనికులను చంపి 25 ఆర్మీ పోస్టులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయని నేడు,ఆదివారం పేర్కొంది. తాలిబన్ ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్లోని అన్ని అధికారిక సరిహద్దులు, వాస్తవ సరిహద్దుల్లో పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉంది. ఈ దాడులలో మరో 30 మంది పాకిస్తానీ సైనికులు గాయపడ్డారని కూడా ఆయన ధృవీకరించారు.పాకిస్తాన్ మరోసారి ఆఫ్ఘనిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తే, మన సాయుధ దళాలు దేశ సరిహద్దులను రక్షించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. అని ఆఫ్ఘన్ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అయితే కాబూల్ పై తాము దాడి చెయ్యలేదని పాకిస్తాన్ ఖండించింది. ‘అయితే ఆఫ్ఘన్ ఉగ్రవాద చర్యలకు బలమైన ప్రతిస్పందన’ ఉంటుందని ప్రధాని షరీఫ్ ప్రతిజ్ఞ చేశారు.
