సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అగ్ర సినీ నిర్మాత అశ్విని దత్ సమర్పణలో, జెమిని కిరణ్ నిర్మాతగా.. సూపర్ స్టార్, స్వర్గీయ కృష్ణ మనుమడు, దివంగత నటుడు ఘట్టమనేని రమేష్ బాబు వారసుడిగా జయ కృష్ణ(Jaya Krishna)ని హీరోగా పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే. బాబాయ్ మహేష్ బాబు అందచందాలు ఇతనిలోను కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి, ఆర్ఎక్స్ 100′ సినిమా ద్వారా సూపర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో ఘట్టమనేని మూడోతరం వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ సినిమా వచ్చే వారం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రవీనా టాండన్ కుమార్తే. రషా తడానీ(Rasha thadani) నటించ బోతుంది. సినిమాకు జీవి ప్రకాష్ సంగీత దర్శకుడిగా పనిచేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా తిరుపతి బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా రాబోతుందని ఈ సినిమాకు “అలివేలు మంగాపురం ” (Alivelumangapuram) అనే టైటిల్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో? నటించనున్నట్టు తెలుస్తుంది
