సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం 35వ వార్డులో గత మంగళవారం రాత్రి గురుస్వామి పెనుమాత్య రామరాజు ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన శ్రీస్వామి శరణం అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పాల్గొని అయ్యప్ప స్వామివారిని దర్శించుకొని పడిపూజ, భజన ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున అయ్యప్పమాల ధారులు భవానీలు, నేరెళ్ల వెంకట సురేష్ కుటుంబ సభ్యులు,కోళ్ల నాగేశ్వర రావు, కారుమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ,
