సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం హైదరాబాద్‌ నగర శివారులో భూప్రకంపనలు ప్రజలను భయకంపితులను చేసాయి. గాజుల రామారంలో భారీ శబ్దంతో భూప్రకంపనలు వచ్చాయి. మెట్కాన్‌గూడెం పరిసరాల్లో కూడా భూమి కంపించింది. భూప్రకంపనల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు భయంతో ఇళ్ల నుంచి రోడ్డు మీదకు పరుగులు తీశారు. అయితే, ఇది నిజంగా భూకంపమా? లేదా ఎక్కడైనా కొండలలో జరిగిన బాంబు పేలుడుతో వచ్చిన శబ్దమా ? అన్న అనుమానాలు తెలవాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *