సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ వ్యాప్తంగా తాజగా నేడు, సోమవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్పై రూ.2.84, డీజిల్పై రూ.2.86 చొప్పున పెంచినట్లు ప్రకటించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 102 కాగా డీజిల్ 95 రూపాయలు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.69కి చేరుకోగా, లీటర్ డీజిల్ ధర రూ.103.82గా ఉంది. ఇదే ఆంధ్ర ప్రదేశ్ లో 1 లీటర్ పెట్రోల్ 117 రూపాయలు పైగా ధరలు పెరిగాయి. కేవలం 2వారాలలోపే 4 సార్లు పెట్రోలు , డీజిల్ ధరలు సుమారు 8 రూపాయలకు పెరిగిపోవడం దీనితో పాటు దేశవ్యాప్తంగా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతుండటం తో పేద మధ్యతరగతి ప్రజలు ఆందోళన అంతా ఇంతా కాదు..
