సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 3 రోజులుగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. దీనిలో భాగంగా నేడు, శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 3వేలు తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 2,750 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 143 డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,331 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా.. భారతదేశంలో కిలో వెండిపై రూ.10వేలు తగ్గుదల చోటు చేసుకుంది.తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,40,000 వద్దకు చేరింది.నియ్ శనివారం ఉదయం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,70,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,65,000 వద్ద కొనసాగుతోంది.
