సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు కు పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు .ప్రముఖ రియల్టర్ , లింగమనేని రమేశ్. నామినేషన్ దాఖలు చేశారు. రమేశ్ నామినేషన్ను 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. రమేష్ నామినేషన్పై ఆరుగురు జనసేన ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. లింగమనేని వెంట మద్దతుగా మెగా బ్రదర్ ఎమ్మెల్సీ నాగబాబు కూటమి ఎమ్మెల్యేలు… భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నర్సాపురం ఎమ్మెల్యే నాయకర్, వంశీకృష్ణ శ్రీనివాస్, దేవ వరప్రసాద్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కాగిత కృష్ణ ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, ఎన్ ఈశ్వర రావు (బీజేపీ) వెళ్లారు. అసెంబ్లీ ఉప సభా పతి రఘురామా కృష్ణంరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు లింగమనేని కి శుభాకాంక్షలు తెలిపారు.
