సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ అమెరికా యుద్ధం యుద్ధం హోరాహోరీగా కొనసాగుతున్నప్పటికీ భారత్ లో జూన్ త్రైమాసిక ఫలితాల (Q1 FY27) సీజన్ ప్రారంభం కావడం మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా అంచనాలకు మించి లాభాలను ప్రకటించడంతో ఐటీ రంగం పరుగులు పెట్టింది. భారత్ దేశీయ ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లలో వచ్చిన భారీ కొనుగోళ్ల మద్దతుతో నిన్నటి ఫ్లాట్ గా ముగిసిన ట్రెండ్ను పక్కనబెట్టి . నేడు, శుక్రవారం ట్రెడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 960 పాయింట్లకు పైగా లాభపడింది. నేటి .ఉదయం 77,370.77 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, రోజంతా కొనుగోళ్ల జోరుతో గరిష్ఠంగా 78,282.55 పాయింట్ల స్థాయిని తాకింది. చివరికి. 964.59 పాయింట్లు (1.25శాతం) లాభపడి 78,151.45 వద్ద స్థిరపడింది.నిఫ్టీ కూడా 24,127.60 వద్ద గ్రీన్ మార్క్తో ట్రేడింగ్ను ఆరంభించి, 24,367.30 వద్ద ముగిసింది. అంతిమంగా 261.55 పాయింట్లు (1.09శాతం) లాభం సాధించి 24,334.30 వద్ద ముగిసింది.( stok market)
