సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన పిఠాపురం పంచాయితీరాజ్ ఏ ఈ కుటుంబం గోదావరి లో దూకి ఆత్మహత్యలో కాకినాడ చెందిన నిందితుడు,సాదిక్ఖాన్ ‘లవ్ జిహాదీ’గా మతం మారమని వారి కుటుంబాన్ని వేధించినట్లు మృతురాలు లేఖలో పేర్కొంది. సాదిక్ఖాన్ ను ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు..ఈ ఘటనను మరువక ముందే కాకినాడలో మరో లవ్ జిహాద్ కేసు సంచలనం రేపింది. ఇప్పుడు గౌస్ మోహిద్దీన్ బాధితులు , యువతిలు బయటకొచ్చారు. గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తిపై బాల రమ్యశ్రీ అనే మహిళ కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్నాధపురానికి చెందిన గౌస్ మొహిద్దీన్ తనను 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసు కున్నాడని తెలిపింది. ప్రేమ పేరుతో దగ్గరై, తీవ్ర ఒత్తిడితో మతం మార్చి ముస్లీమ్ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నాక చిత్రహింసలకు గురి చేశాడని కంప్లైంట్లో పేర్కొంది. అంతేకాదు.. తనతో పాటు మరో ఐదుగురిని కూడాఒకరికి తెలియకుండా మరొకరిని ఇలాగే మోసం చేసివారితో సహజీవనం చేశాడని బాల రమ్యశ్రీ ఆరోపించింది. ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
