సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగ కోసం ఎదురుచూస్తున్నా అభ్యర్థులకు నేడు, బుధవారం శుభవార్త వచ్చింది. పోలీసు శాఖలో 2,050 పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 378 ఎస్ఐ, 1,156 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించింది. ఈ ఉద్యోగాల కోసం ప్రాథమిక రాత పరీక్ష తేదీని త్వరలో APSLPRB ప్రకటించనుంది. దరఖాస్తును అధికారిక వెబ్సైట్ (https://slprb.ap.gov.in) ద్వారా మాత్రమే ఆన్లైన్లో సమర్పించాలని ప్రభుత్వం ప్రకటించింది.
